ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ మందిరంలో మరియు జిల్లా కలెక్టర్ గారి ఛాంబర్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 40 దరఖాస్తులు ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వర్ మరియు అదనపు కలెక్టర్ రెవిన్యూ ఎస్ శ్రీను ట్రైని కలెక్టర్ ప్రణయ్ కుమార్ ను విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.