హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు బ్రహ్మచారిణి అలంకారంలో భ్రమరాంబికా దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి పూజలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.