బాపట్ల సీఐ, ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని బాపట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంచర్ల అవినాష్ డిమాండ్ చేశారు. ఇటీవల బాపట్ల బార్ అసోసియేషన్ సభ్యుడు విజయ్ కుమార్పై పోలీసులు దురుసుగా ప్రవర్తించి స్టేషన్లో 4 గంటలు నిర్బంధించటాన్ని ఖండించారు. ఈ ఘటనకు నిరసనగా మంగళవారం విధులను బహిష్కరిస్తున్నామన్నారు. వారిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని అవినాష్ డిమాండ్ చేశారు.