రాంబిల్లి మండలంలోని గోకివాడ సచివాలయ పరిధిలో గల గోకివాడ, మూలకొత్తూరు, మూలజంప గ్రామాలకు చెందిన 24 మంది గ్రామ వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. ఈ మేరకు వారు మంగళవారం ఎంపీడీఓకు రాజీనామా పత్రాలను సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు తమను పెడుతున్న ఇబ్బందుల దృష్ట్యా మూకుమ్మడి రాజీనామాలు చేసినట్లు తెలిపారు.