గుంటూరు పోలీసులు పార్కింగ్ చేసిన కార్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేశారు. నిందితుడిని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా గిరిజవోలుకి చెందిన జంగం బాజీ అని తెలిపారు. నిందితుడి నుంచి రూ.6 లక్షల విలువైన ల్యాప్టాప్లు, రూ.2 లక్షల నగదు, 11 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.