ఆలమూరు మండలంలోని చొప్పెల్ల గ్రామంలో ఆదివారం లారీ బోల్తా పడడంతో ఓ వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై శ్రీను నాయక్ తెలిపారు. వివరాలు ఇలా.. కొత్తపేటకు చెందిన పెద్దరెడ్డి రాజు చొప్పెల్ల గ్రామంలోని ఓ ఇటుక బట్టీ వద్ద మట్టితో ఉన్న లారీ అన్లోడింగ్ చేయడానికి వాహనాన్ని వెనుక వైపు కదిలించగా ప్రమాదవశాత్తు లారీ బోల్తాపడింది. దీంతో రాజు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడని చెప్పారు.