ఎమ్మిగనూరులో శాంతి కమిటీ సమావేశం..వినాయక చవితి సందర్భంగా ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అన్ని మతాల పెద్దలను ఉద్దేశించి మాట్లాడుతూ.. పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సోదరభావంతో జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలన్నారు. సమావేశంలో పోలీసు సిబ్బంది, మత పెద్దలు పాల్గొన్నారు.