కామారెడ్డి జిల్లాలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసిలో జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షం అనంతరం జిల్లాలో వివిధ శాఖలవారీగా చేపట్టిన పునరుద్దరణ పనులను వేగవంతం చేసి సాధారణ ప్రజాజీవనానికి ఇబ్బందులను తొలగించాలని అన్నారు. జిల్లాలో శానిటేషన్ కార్యక్రమాలను పగద్భoదీగా నిర్వహించాలని, గురుకుల విద్యాలయాలతోపాటు అవుసరమైన ప్రాంతాలలో వైద్య క్యాంప్ లను ఏర్పాటు చేసి ఫీవర్ సర్వే చెయ్యాలని అన్నారు.