విద్యా సంవత్సరంలో ఇన్వెస్టిచర్ కార్యక్రమం ఒక ముఖ్య ఘట్టమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ మేరకు గురువారం ఉదయం హాజీపూర్ మండలం గుడిపేటలో గల కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన ఇన్వెస్టిచర్ కార్యక్రమానికి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాయకత్వం ఒక బాధ్యత గల అధికారమని, నిజాయితీ, పట్టుదల, సేవా దృక్పథం ద్వారా సమాజాన్ని ప్రభావితం చేయగలరని తెలిపారు.