Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ సౌత్: భారీ వర్ష సూచనల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అధికారుల సమీక్షలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

Nizamabad South, Nizamabad | Aug 28, 2025
రానున్న 48 గంటల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన దృష్ట్యా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. పట్టణాలు, గ్రామాలు, తండాలలో ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని, ఎక్కడ కూడా ఏ చిన్న అవాంచనీయ సంఘటన చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి సిపి సాయి చైతన్యతో కలిసి కలెక్టర్ గురువారం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొని ఉన్న పరిస్థితులను సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us