Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: భద్రాద్రి జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

Kothagudem, Bhadrari Kothagudem | Aug 23, 2025
ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. శనివారం ఐడిఓసీ కార్యాలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ,నిమజ్జన ఏర్పాట్లపై రెవెన్యూ,పోలీస్, పంచాయతి రాజ్,అగ్నిమాపక,విద్యుత్,మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకావాలని అన్నారు. గణేష్ మండపాలను తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు,వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ముందస్తుగా గణేష్ మండలి నిర్వాహకులు పూర్తి వివరాలు అందించాలని తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us