Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం నరసింహ స్వామి సింహాచలంలో నిత్య కళ్యాణం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది

India | Sep 10, 2025
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి *నిత్య కల్యాణం* అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణములో పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనా లు అందజేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us