చేవెళ్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి చెందారు. అయితే కూతురు కృపను తండ్రి తోల్కట్ట సమీపంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల నుంచి ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మృతులు VKB జిల్లా కోట్ పల్లి మండలం బీరెల్లితండాకు చెందిన రవీందర్, కృపగా గుర్తించారు.