గణేష్ ఉత్సవాల్లో మట్టి వినాయక ప్రతిమలను వినియోగించి.. పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో.. గణేష్ ఉత్సవాల్లో పర్యావరణ సహిత మట్టి విగ్రహాల వాడకాన్ని ప్రోత్సహిస్తూ, ప్రజల్లో అవగాహన పెంచేలా.. రాష్ట్ర పర్యావరణ నియంత్రణ మండలి వారు రూపొందించిన పోస్టర్ లను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు జిల్లా కలెక్టర్ కు మట్టి వినాయకుడి ప్రతిమను అందించారు.