సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతుల పడిగాపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద యూరియా కోసం వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్యూ లైన్ లో వేచి ఉన్న సందర్భంలో కొంతమంది మహిళల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్న పరిస్థితి కనిపించింది. గంటల తరబడి నిలబడలేక ఓపిక లేక వృద్ధులు, మహిళలు పాదరక్షలను క్యూ లైన్ లో పెట్టారు. తమ వంతు కోసం ఎదురు చూశారు. రైతులు తమ పొలం పనులు వదిలిపెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురుచూస్తున్నారు. అటు పొలం పనులు కాక.. ఇటు యూరియా బస్తాలు దొరక