తిరుపతి జిల్లా గూడూరులో టిడిపి మాజీ ఎమ్మెల్యే సతీమణి సంధ్యారాణి బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు క్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రతి గడపకు వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా సమస్యలతో గూడూరు ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు. ఈసారి 2024లో చంద్రబాబును గెలిపించుకోవాలని ఆమె కోరారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ను గెలిపించుకొని అభివృద్ధి పథంలో వెళ్దామని తెలిపారు.