కొయ్యూరు మండలం చిట్టెంపాడు గ్రామ సచివాలయాన్ని శుక్రవారం ఎంపీడీవో డీ.బాలమురళికృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు గురించి కార్యదర్శి రాంబాబును అడిగి తెలుసుకున్నారు. తరువాత డౌనూరు గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం డౌనూరు పీహెచ్సీని సందర్శించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు, సిబ్బందికి సూచించారు.