నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సోమవారం సీఐ శ్రీకాంత్ బాబు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ... బాలికలను ఆకతాయిలు వెంటపడి వేధిస్తే ఆ సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలపాలన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లి విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులకు సీఐ సూచించారు.