రైతుల వద్ద ఉన్న నల్ల బర్లి పొగాకును వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో పొగాకు రైతులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 80 రోజులుగా రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన పొగాకు వెంటనే డబ్బులు చెల్లించాలన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు రైతుల వద్ద నుండి 6000 మెట్రిక్ టన్నుల పొగాకును మాత్రమే కొనుగోలు చేశారని ఇంకా 83% పొగాకు రైతులు వద్దనే ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు రైతుల వద్ద ఉన్న చివరి ఆకు వరకు పొగాకును కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.