Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ సౌత్: రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: నిజామాబాద్ డీఎస్ఓ వినయ్ రెడ్డి వెల్లడి

Nizamabad South, Nizamabad | Aug 22, 2025
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, లబ్దాలు దరఖాస్తు చేసుకొని కొత్త రేషన్ కార్డులను పొందవచ్చని, ఇప్పటి వరకు 44వేల రేషన్ కార్డులను జారీ చేసినట్లు నిజామాబాద్ DSO వినయ్ రెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల రేషన్ కార్డులను ఆర్ఐ లెవెల్లో 9,405, ఎమ్మార్వో వద్ద 921, డీఎస్ఓ కార్యాలయంలో 1,371 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. త్వరలో వీటిని లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. మధ్యవర్తులను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దన్నారు. ఇంకా ఎవరైనా దరఖాస్తుదారులు ఉంటే, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని, త్వరలో జారీ చేస్తామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us