Kandukur, Sri Potti Sriramulu Nellore | Sep 4, 2025
గుడ్లూరు-చిమిడిపాడు రోడ్డులో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 18 బస్తాల పీడీఎస్ రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు SI వెంకట్రావు తెలిపారు. వాహనం నడుపుతున్న దేవరకొండ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతనికి బియ్యం విక్రయించిన చిమిడిపాడుకి చెందిన కాపులూరి బాబురావుపై కూడా కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.