ట్రైపాడ్ ద్వారా గిరిజన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని జేసీ అభిషేక్ అన్నారు. గురువారం మధ్యాహ్నం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని వెలుగు జిల్లా సమాఖ్య కేంద్రంలో అధికారులతో వన్ దన్ వికాస్ కేంద్రాల గిరిజన సభ్యులు, వారి ఉత్పత్తులకు సంబంధించి ప్రదర్శన ప్రారంభించారు. వన్ దన్ వికాస్ కేంద్రాల సభ్యులు గిరిజన ఉత్పత్తులను ఎంప్యానల్మేంట్ చేసుకోవాలన్నారు. దేశంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన స్టోర్స్ లో అమ్మకాలు చేయబడతాయన్నారు.