వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త కాలువ రైల్వే బ్రిడ్జి సమీపంలో ఆదివారం ఒక గుర్తు తెలియని యువకుని మృతదేహం పడి ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో ఎస్ఐ జనార్దన్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు