Download Now Banner

This browser does not support the video element.

గిద్దలూరు: కంభం మండలం దర్గా గ్రామ సమీపంలో పెద్దపులి సంచారం, ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు

Giddalur, Prakasam | Aug 28, 2025
ప్రకాశం జిల్లా కంభం మండలం దర్గా గ్రామ సమీపంలోని పరిసర ప్రాంతాలలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. పాదముద్రలు గుర్తించిన స్థానికులు ఆందోళన చెంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పులి పాదముద్రలు పరిశీలించారు. అవి పెద్దపులి పాద ముద్రలేనని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఒంటరిగా ప్రజలెవరు ఇటువైపు రావద్దని అంతేకాకుండా పెద్దపులి సంచారాన్ని గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గురువారం సాయంత్రం 5 గంటలకు వెల్లడించారు. పెద్దపులి సంచారంతో స్థానిక గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us