Download Now Banner

This browser does not support the video element.

బోధన్: నవిపేటలో ఇటుక బట్టి వ్యాపారం చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా

Bodhan, Nizamabad | Sep 10, 2025
నవీపేట మండలం యంచ గ్రామంలో ఇటిక బట్టి కార్మికులైన పిరాజి ముఠాపై దొంగతనం ఆరోపణలు వచ్చాయి. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో నివసిస్తున్న ఈ ముఠా, బతుకు తెరువు కోసం ఇటిక బట్టి ఏర్పాటు చేసుకుని, ఇప్పుడు దొంగతనాలకు పాల్పడుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. హైవే రోడ్ కాంట్రాక్టర్ వర్క్ కోసం సుమారు 30 క్వింటాళ్ల సల్లాకను దొంగిలించినట్లు గ్రామస్తులు బుధవారం గుర్తించారు. పిరాజి నివసిస్తున్న ఇంటి వద్ద దొంగిలించిన వస్తువులను ఉంచినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ముఠాపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us