మణుగూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సూరి రెడ్డి మణుగూరు కోర్టులో న్యాయవాదులకు హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు న్యాయం వైపు ఉన్నప్పుడు పేదలకు కోర్టులపై నమ్మకం ఏర్పడుతుందన్నారు. గ్రామాలలో న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించాలన్నారు.