Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: సింహాచలం వరాహలక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్న నగర మేయర్ పీలా శ్రీనివాసరావు

India | Aug 23, 2025
విశాఖపట్నం నగర మేయర్ పీలా శ్రీనివాసరావు శనివారం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 98వ వార్డు కార్పొరేటర్ శ్రీ పీవీ నరసింహం ఆయనతో పాటు స్వామివారి దర్శనంలోపాల్గొన్నారు. వీరికి ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ సింగం రాధ , సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు పర్యవేక్షణాధికారి త్రిమూర్తులు అర్చకులు నాదస్వర వాద్యాలతో, వేదమంత్రోచ్చారణల తో స్వాగతం పలికారు. ముందుగా మేయర్, ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని అనంతరం స్వామివారి మూలవిరాట్టును దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us