Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ సౌత్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

Nizamabad South, Nizamabad | Sep 10, 2025
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి బుధవారం సాయంత్రం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు, ప్రభుత్వ కార్యాలయ భవనాలపై సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు, ఉపాధి హామీ కూలీలచే పంట పొలాల్లో ఇసుక మేటలు తొలగింపు, ఈజీఎస్ కాంపోనెంట్ మెటీరియల్ పనుల పురోగతిపై ఎంపీడీఓలు, ఎంపీఓలు, హౌసింగ్ ఏ.ఈలు, ఏపీఓ లు, ఏపీఎంలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us