కాజీపేట మండలం మల్కపల్లి గ్రామంలో వృద్ధులు వితంతువులు వికలాంగులు తమకు పెన్షన్ డబ్బులు ఇవ్వడం లేదని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు వారికి సిపిఎం నాయకులు జంగూబాయ్ భూమన్న మద్దతు తెలిపారు ఈ సందర్బంగా పెన్షన్ ఆధారంతో జీవించే వృద్ధులు వితంతువులు వికలాంగులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు పంచాయతీ కార్యదర్శిని అడిగితే తనకు ఎటువంటి సంబంధం లేదని పేదలను బెదిరిస్తున్నారని తెలిపారు వెంటనే పెన్షన్ అందజేయాలని డిమాండ్ చేశారు