శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ 54వ జన్మదినం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ నాయకులు టిడిపి పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం మరియు అన్నదాన కార్యక్రమం , నిరుపేదలకు బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిఎ సురేంద్ర మరియు టిడిపి నాయకులు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.