శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం పెడపల్లి గ్రామపంచాయతీలో సోమవారం ఉదయం లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంచానికే పరిమితమైన రామలక్ష్మమ్మ, వీరేశ్లకు ఒక్కొక్కరికి రూ.15000 చొప్పున అందజేశారు. లబ్ధిదారులతో వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యలను తెలుసుకన్నారు. అర్హులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.