గద్వాల జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఎరువుల కోసం రైతులు పీఏసీఎస్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. శనివారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు. ప్రభుత్వం యూరియా సరఫరా చేస్తామని హామీ ఇచ్చినా పరిస్థితి మారడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.