Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 31, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని పాత బస్టాండు ఆవరణలో బిజెపి నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. చిట్యాల బిజెపి మండల అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడానికి నిరసిస్తూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసినట్లు తెలిపారు