ఏపీలో రైతాంగానికి ఎరువులను సక్రమంగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాజమండ్రి సబ్ కలెక్టరేట్ వద్ద సిపిఐ పార్టీ ధర్నా నిర్వహించింది. ఎరువుల బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. పెరిగిన డిమాండ్ ను తగ్గట్టుగా యూరియా సరఫరా చేయడం లేదన్నారు. ఖరీఫ్ పంట చేతికి వచ్చే సమయంలో యూరియా కోసం రైతులు పడిగాపులు పడటం సరికాదన్నారు మధు.