గోపాలపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసించారు.