భారీ వర్షాల ప్రభావంతో మహేంద్ర తనయ నదిలో వరద ఉద్ధృతి పెరగడంతో పాతపట్నం సమీపంలోని కాపు గోపాలపురంలో గ్రామానికి వెళ్లే కాజ్వే పై నుంచి నీరు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం పాతపట్నం పోలీసులు నీటి ప్రవాహాన్ని పరిశీలించి, ప్రజల రాకపోకలను నిలిపివేస్తూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. వరద నీటి ప్రవాహం పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.