గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ర పట్టుకుంటే వైసిపి నాయకులు గొడ్డలి పట్టుకు వస్తారని హెచ్చరించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఏర్పాటు చేసిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మహిళా శక్తి బహిరంగ సభకు రాకపోతే డ్వాక్రా మహిళలకు రుణాలు ఆపేస్తామని టిడిపి నాయకులు బెదిరించారని విమర్శించారు.