చాగలమర్రి పట్టణానికి చెందిన ఎం.అజముద్దీన్ను ప్రభుత్వం రాష్ట్ర మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించింది. ఈ సందర్భంగా బుధవారం ఆయనను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు ఆన్సర్ బాషా, మండల కన్వీనర్ నరసింహ రెడ్డి, భూమా అభిమానులు పాల్గొన్నారు.