ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ కర్ణాటక ప్రాంతం నుంచి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. 3.67 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు శనివారం మధ్యాహ్నం తెలిపారు. 34 గేట్లు ఎత్తి 3.67 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని దిగువ శ్రీశైలానికి వదులుతున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318 మీటర్లు కాగా.. ప్రస్తుతం 317 మీటర్లు ఉందని, ప్రాజెక్టులో 6.598 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.