అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని సింగనమల మండలం శివపురం వద్ద జాతీయ రహదారిపై ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నార్పల మండలం నడిమి దొడ్డి గ్రామానికి చెందిన పలువురికి గాయాలయ్యాయి. నడిమి దొడ్డి నుంచి అనంతపురం కు ఆటోలో వస్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.