కూటమి ప్రభుత్వం క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు . జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కాకినాడ క్రీడా మైదానంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కొండబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడలను ప్రారంభించారు. క్రీడాకారులను ఎమ్మెల్యే పరిచయం చేసుకున్నారు.