Download Now Banner

This browser does not support the video element.

మార్కాపురం: పట్టణంలో దివ్యాంగుల విద్యార్థులకు ఉపకరణాలను అందజేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

India | Aug 23, 2025
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ఆరు నుండి 17 సంవత్సరాల దివ్యాంగుల విద్యార్థులకు ఉచిత ఉపకరణాల కోసం స్క్రీనింగ్ సెంటర్లను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఈ భిన్న ప్రతిభావంతులకు భవిత సెంటర్లను ఏర్పాటు చేసి స్పీచ్ థెరపీ ప్రత్యేక బోధనా పద్ధతులు ద్వారా బోధించడం జరుగుతుందన్నారు. వీరికి భవిత కేంద్రాల వద్ద పిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us