'సేంద్రీయ ఎరువుల ద్వారా భూసార పరిరక్షణ' ఆళ్లగడ్డ మండలం కొండంపల్లెలో సేంద్రీయ ఎరువుల వాడకం గురించి రైతు సదస్సు మంగళవారం నిర్వహించారు. వీఏఎల్ ఆగ్రో టెక్ మార్కెట్ డెవలప్మెంట్ ఆఫీసర్ చిన్న ఓబయ్య ఆధ్వర్యంలో రైతుల పొలాల వద్దకు వెళ్లి రసాయనిక ఎరువుల వాడకంపై కలిగే అనర్థాలను వివరించారు. పంటల సాగులో రసాయనిక ఎరువులను మోతాదుకు మించి వాడటం వల్ల ఆహార ఉత్పత్తులు విషతుల్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.