Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: ఈ నెల 13వ తేదిన జరుగు జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా ఎస్పీ మహేష్ బి గితే

Sircilla, Rajanna Sircilla | Sep 9, 2025
13న జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడ దగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు,ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు,వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ,విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులో, డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టి కేసులు మరియు ఇతర రాజీ పడ్డ దగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. రాజీ మార్గం రాజ మార్గమని చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని సమయాన్ని ,డబ్బులను వృధా చేసుకోవద్దని, జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us