రెబ్బెన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో నిల్వ ఉంచిన 43 యూరియా బస్తాలను మండల నాయకులు బెదిరింపులకు గురిచేసి యూరియా బస్తాలను అపహరించినట్లు సహకార సంఘం సీఈవో శేషారావు రెబ్బెన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా బస్తాల పంపిణీలో భాగంగా తాను ఆఫీసుకు రాగానే మండల కేంద్రానికి చెందిన కొంత మంది నాయకులు 43 యూరియా బస్తాలను బెదిరింపులకు గురిచేసి తీసుకెళ్లినట్లు పిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.