కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిళ్ళు గంజాయి బ్యాచ్ స్వైర విహారం చేసింది. వీరు ద్విచక్ర వాహనాల నుండి పెట్రోల్ దొంగలించడానికి కూడా వెనకాడడం లేదు. తాజాగా సూరారం కాలనీలో ఓ ద్విచక్ర వాహనం నుండి పెట్రోల్ తీస్తుండగా సీసీ కెమెరాలు దృశ్యాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పెట్రోలింగ్ పెంచి, గంజాయి సేవించే వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.