రాజంపేట ఎంపీ వెంకట మిథున్ రెడ్డిని పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తో పాటు వైఎస్ఆర్సిపి శ్రేణులు సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు.కూటమి ప్రభుత్వం పెట్టిన లిక్కర్ అక్రమ కేసులో 47 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించి తాత్కాలిక బెయిల్ పై ఈనెల 12 వరకు విడుదలైన రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన ఇంటి వద్ద మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తోపాటు పీలేరు నియోజకవర్గం లోని వైసీపీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి స్థానిక పరిస్థితులపై చర్చించారు