వేములవాడ అర్బన్ మండలం కోడుముంజ శ్రీకృష్ణ కురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కురుమ యాదవ సంఘం అధ్యక్షుడు, కొడుముంజ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చిగుర్లు పర్శరాములు, ఉపాధ్యక్షుడు వట్టేల బక్కయ్య, కుల సంఘం పెద్దలు, సభ్యులు ఉన్నారు.