Download Now Banner

This browser does not support the video element.

మార్కాపురం: తర్లపాడు బీసీ హాస్టల్ సమీపంలో రోడ్డుపై మురుగునీరుతో అవస్థలు పడుతున్నామని రైతు సంఘం నాయకులు పాపిరెడ్డి వెల్లడి

India | Sep 6, 2025
ప్రకాశం జిల్లా తర్లపాడు మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ సమీపంలో రోడ్డుపై మురుగునీరుతో అవస్థలు పడుతున్నామని రైతు సంఘం నాయకులు పాపిరెడ్డి తెలిపారు. ఎన్నో నెలల నుండి నీరు నిలబడిపోవడంతో డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా జ్వరాలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని అన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి చేస్తామని రైతు సంఘం నాయకులు పాపిరెడ్డి అన్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us