ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులకు సూచించారు సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 86 ఫిర్యాదులు వచ్చాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లకు అర్జీలను సమర్పించారు